KDP: కూటమి ప్రభుత్వం రైతాంగాన్నికి తీవ్రంగా నష్టం చేకూర్చిందని వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం కడపలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్కి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పెన్షన్ తప్ప మరొక పథకాన్ని అమలు చేయలేదన్నారు. ఆర్బికే కేంద్రాలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.