ASR: విద్యార్థిని మృతికి కారణమైన పాఠశాల వార్డెన్, హెచ్ఎంపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ శుక్రవారం డిమాండ్ చేశారు. తాటిపర్తి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సత్యవతి అనే విద్యార్థిని 5రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నా సిబ్బంది పట్టించుకోలేదన్నారు. దయ్యం పట్టిందని కొట్టడంతో మృతి చెందిందన్నారు.