KMM: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పాకిస్థాన్ ప్రేరేపిత తీవ్రవాదుల దాడిలో అసువులు బాసిన అమరవీరులకు శుక్రవారం నివాళులర్పించారు. పాకిస్థాన్ ఏఎస్సై ప్రేరేపిత తీవ్రవాదులు 2001లో సరిగ్గా నేటి రోజున డిసెంబర్ 13వతేదీ పార్లమెంటుపై దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ముష్కరుల దాడిలో ప్రాణాలర్పించిన పార్లమెంట్ ఉద్యోగులు, భద్రతా సిబ్బందికి శ్రద్ధాంజలి ఘటించారు.