కడప: కడప-చెన్నై ప్రధాన రహదారిపై ఒంటిమిట్ట బస్టాండ్ వద్ద విచ్చలవిడిగా ఆవులు రహదారిపై అడ్డంగా ఉన్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు ఆలయానికి, ఇటు కార్యాలయాలకు ప్రజలు ఎక్కువగా వస్తూ ఉంటారని, ప్రమాదాల సంభవించే అవకాశం ఉందని అన్నారు. ఆవుల యజమానులపై అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.