బంగ్లాదేశ్లో హిందువులు, మైనారిటీలపై దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా పార్లమెంట్లో విదేశాంగ మంత్రి జై శంకర్ మాట్లాడారు. బంగ్లాదేశ్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అక్కడి మైనారిటీల భద్రతకు చర్యలు తీసకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.