TG: తెలంగాణ తల్లిపై రేవంత్ రెడ్డి సర్కార్ గెజిట్ ఇవ్వడం దారుణమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ‘దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారి విగ్రహాలు పెట్టుకుంటాం. జీవో ఇస్తేనే ప్రాణత్యాగాలు చేసిన వారి విగ్రహాలు పెడతామా’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీది తెలంగాణ వాదం కాదు.. కాంగ్రెస్ వాదమని విమర్శించారు. వారికి కాంగ్రెస్ ప్రయోజనాలే తప్ప తెలంగాణ ప్రయోజనాలు పట్టవని మండిపడ్డారు.