SRD: జోగిపేటలో కురుమ సంఘం నాయకులు ఏర్పాటు చేసిన కురుమ సంఘ ఆత్మీయ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈనెల 14న, సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ది రామయ్య, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా జరిగే కోకాపేటలో దొడ్డి కొమురయ్య కురుమ ఆత్మ భవన ప్రారంభోత్సవ కరపత్రాలను సంగారెడ్డి జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు, కార్పొరేటర్ పుష్ప నగేష్ ఆవిష్కరించారు.