KMM: ఖమ్మం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద బుధవారం మార్కెట్ నిర్వాహకులు మిర్చికి జెండా పాట నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ నిర్వాహకులు మాట్లాడుతూ… కొత్త తేజ మిర్చి క్వింటా రూ. 16,001, ఏసీ తేజ మిర్చి రూ. 16,700 పలికినట్లు తెలిపారు. అదేవిధంగా మార్కెట్కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.