NLG: మిర్యాలగూడ మండలం చిల్లాపురం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బుధవారం అధికారులు, గ్రామస్థులు మరియు నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.