KRNL: మంత్రాలయం పుణ్యక్షేత్రంలోని శ్రీరాఘవేంద్ర స్వామి ఆలయంలో నాగ సాధువులు ప్రత్యక్షమయ్యారు. రాఘవేంద్రస్వామి దర్శనార్థం నాగ సాధువులు వచ్చారు. ముందుగా గ్రామదేవత శ్రీమంచాలమ్మ దేవికి కుంకుమార్చనలు నిర్వహించి అనంతరం శ్రీరాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. శ్రీమఠం పీఠాధిపతులు నాగ సాధువులను శాలువాలతో సత్కరించారు.