PLD: మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును కఠినంగా శిక్షించాలని చిలకలూరిపేటలో అంబేడ్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టుల సంక్షేమ సంఘం నాయకులు నిరసన తెలిపారు. ఆస్తి తగాదాల విషయంపై వారి కుమారులు రోడ్డు మీదకి రావడంతో మీడియా వ్యవస్థ చొరబడిందన్నారు. అటువంటి మీడియా పాత్రికేయులపై దాడులు చేసిన మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. మీడియాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు.