ఖమ్మం: మధిర క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని తహశీల్దార్ రాంబాబు అన్నారు. బుధవారం ఇండోర్ స్టేడియం గ్రౌండ్లో నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీలను మండల తహశీల్దార్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మొండితోక లత, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.