CTR: వైసీపీ శ్రేణులంతా ప్రజలకు అండగా నిలవాలని మాజీ మంత్రి రోజా సూచించారు. నగరి పట్టణంలోని తన నివాసంలో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ.. వైసీపీ శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. సమస్యలు వస్తే పరిష్కరించేలా పనిచేయాలని కోరారు. నగరి మున్సిపల్ ఛైర్మన్ నీలమేఘం, ఇతర నాయకులు బాలకృష్ణన్, తిరుమల రెడ్డి, బాలకృష్ణన్, వేణుబాబు పాల్గొన్నారు.