MDK: సీఎం సహా నిధి పేదలకు వరం అని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. హత్నూర మండలం కొడిప్యాక గ్రామానికి చెందిన మల్లారెడ్డికి రూ. 60వేల సీఎం సహాయ నిధి చెక్కును మంగళవారం ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో హత్నూర మాజీ ఎంపీపీ వావిలాల నర్సింలు, బీఆర్ఎస్ నాయకులు కొన్యాల నరసింహా రెడ్డి, ఆగమయ్య, బాబు యాదవ్, సురేష్ గౌడ్, పూల అర్జున్ పాల్గొన్నారు.