NRPT: కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహాలను మార్చడం కాదని.. ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలని బీజీపీ జిల్లా అధికార ప్రతినిధి రఘువీర్ యాదవ్ అన్నారు. మంగళవారం నారాయణపేట పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన ఒక అడుగు ముందుకు వేస్తే.. రెండు అడుగులు వెనక్కి వేసినట్లు ఉందని ఎద్దేవా చేశారు.