SKLM: మందస మండల కేంద్రంలో గల ప్రాజెక్టు కార్యాలయంలో ఐసీడీఎస్ సీడీపీవో వసుంధర దేవి ఆధ్వర్యంలో సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలంతా సమయపాలన పాటించాలని సూచించారు. అదేవిధంగా గర్భిణులకు, బాలింతలకు తప్పనిసరిగా నిబంధనల ప్రకారం కిట్లను పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.