SKLM: పోలాకి మండలం గంటపేట గ్రామంలో ఉన్న శ్రీ అసిరి తల్లి అమ్మవారి ఆలయ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువ నేత, జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య అమ్మవారిని దర్శించుకొని.. ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆయన వెంట ఎంపీపీ బైరాగి నాయుడు, మండల వైసీపీ అధ్యక్షులు కృష్ణారావు, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు లక్ష్మణరావు, తదితరులు ఉన్నారు.