HYDలోని పలు ప్రాంతాల్లో కలుషిత నీటి సరఫరా కలకలం రేపుతోంది. బాగ్లింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రం,సైబర్ హుడ్ కాలనీ వంటి చోట్ల తాగునీటిలో డ్రైనేజీనీరు కలిసి వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్యాపుల్లో మురుగు వాసనతో కూడిన నల్లటి నీరు వస్తుండటంతో ప్రజలు రోగాలబారిన పడే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించాలని కోరారు.