MNCL: ఈ నెల 17న హైదారాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి దివ్యాంగ విద్యార్థుల క్రీడా పోటీలలో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఈ సందర్భంగా శుక్రవారం భవిత కేంద్రంలో డీఈవో యాదయ్య విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దివ్యాంగ చిన్నారుల విజయాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అన్నారు.