JGL: ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్లో హైందవ స్వరాజ్య సేన ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కనక నగేశ్, హైందవ స్వరాజ్య సేన సభ్యులు గన్నారపు వంశీ, బత్తుల శ్రీనివాస్, మహేందర్, రాజేందర్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.