NZB: మార్చి 15 లోపు IKP ద్వారా అందించిన రుణాలను 98% రికవరీ చేయాలని వివోఏలను, సీసీలకు ఏపీడి మధుసూదన్ ఆదేశించారు. శనివారం సాయంత్రం రెంజల్ మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో సీసీలకు, వివోఏలకు రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆహార మిషనరీలకు సంబంధించిన 20 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారికి 35% సబ్సిడీ కింద రుణాలను అందజేయనున్నట్లు తెలిపారు.