AP: కాకినాడ జిల్లా సామర్లకోట వేట్లపాలెం పేలుడు ఘటనలో గాయపడి GGHతో పాటు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను CM చంద్రబాబు పరామర్శించారు. వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తారని, ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని వారికి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు అందిస్తున్న వైద్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.