KNR: కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, ట్రైనీ ఐపీఎస్ అధికారి సోహం గంగాధర పోలీస్ స్టేషన్ను శనివారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, మాల్ఖానా, సీజ్ వాహనాల సంరక్షణను పరిశీలించారు. 2023–25 కేసుల పెండింగ్స్, డిస్పోజల్పై సమీక్షించి వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో ఎస్సై వంశీకృష్ణ, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.