AP: ప్రజలు కట్టబెట్టిన భారీ మెజార్టీతో కేంద్రంలో తమ పరపతి పెరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. చీపురుపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘కేంద్రం కూడా మనకు సహకరిస్తోంది. ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశాం. విజయనగరం జిల్లా నీటి కష్టాలు తీరుస్తున్నాం. విజయనగరం పండ్ల తోటలకు కేంద్రంగా మారాలి. అన్నదాత సుఖీభవ ఇస్తామని హామీ ఇచ్చాం.. మాట నిలబెట్టుకున్నాం’ అని పేర్కొన్నారు.