భారత్-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ చర్చలు తుదిదశలో ఉన్నట్లు తెలిపారు. ఒప్పందానికి సంబంధించి న్యాయపరమైన అంశాలపై చర్చించి, ఖరారు చేసేందుకు భారత్-అమెరికా అధికారులు ఫిబ్రవరి 23న అమెరికాలో భేటీ కానున్నారు. ఈ సమావేశం సుమారు మూడ్రోజులు కొనసాగతుందని సమాచారం.