కృత్రిమ మేధ(AI) విప్లవం కారణంగా డేటా సెంటర్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా సైబర్ భద్రతా నిపుణులకు ఐటీ కంపెనీలు భారీ ప్యాకేజీలతో ఆఫర్లు ఇస్తున్నాయి. కొన్ని కీలక పాత్రల కోసం $1.43 లక్షల(రూ.1.38 కోట్లు) నుంచి $1.91 లక్షల(రూ.1.85 కోట్లు) వరకు వార్షిక వేతనాన్ని అందిస్తున్నాయి. జీతంతో పాటు పలు అదనపు సౌకర్యాలను కూడా కల్పిస్తున్నాయి.