SRD: రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. జహీరాబాద్ పట్టణంలో శుక్రవారం ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభించారు. అనంతరం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమమే ‘అరైవ్ అలైవ్’ అని చెప్పుకొచ్చారు.