కృష్ణా: అసెంబ్లీలో శుక్రవారం MLA యార్లగడ్డ వెంకట్రావు APకి ప్రత్యేక స్టాంప్ చట్టం తీసుకురావాలని సూచించారు. పాసుపుస్తకాలపై జగన్ ఫోటోలు వేసుకోవడాన్ని ఆయన విమర్శించారు. రాజముద్రతో కొత్త పాసుపుస్తకాలు పంపిణీపై హర్షం వ్యక్తం చేస్తూ, విజయవాడ రూరల్లో 10 ఎకరాల భూమితో కృష్ణా యూనివర్సిటీ ఫైలు వేగవంతం చేయాలని కోరారు. MRO రికార్డు ట్యాంపరింగ్పై విచారణ చేయాలని కోరారు.