GNTR: ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామంలో పొలంబడి, పొలం పిలుస్తుంది కార్యక్రమాలు శుక్రవారం నిర్వహించారు. గుంటూరు రెగ్యులర్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్. మోహన్రావు మాట్లాడుతూ.. శనగ పంటలో కనిపించే ఎండు తెగులు, వేరు కుళ్లు తెగుళ్లపై రైతులకు అవగాహన కల్పించారు. విత్తన శుద్ధి తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు.