రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మందగించి గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. తిన్న వెంటనే పడుకోవడం వల్ల అధిక బరువు పెరుగే అవకాశం ఉంది. ఇది నిద్రలేమికి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి రాత్రి 8 గంటల లోపే తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది.