దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ఫ్ పర్యావరణహిత, ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే ‘ఫ్లెక్స్-ఫ్యూయల్’ బైక్ను జూన్ 3న లాంచ్ చేయనుంది. పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా, కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగానే హీరో మోటోకార్ప్ సరికొత్త టెక్నాలజీ బైక్ను తీసుకొస్తోంది.