ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. మార్చి 4న హైదరాబాద్లో జరగనున్న తమ రిసెప్షన్ వేడుకకు రావాలని కోరుతూ వారు ప్రధానికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. FEB 26న రష్మిక, విజయ్ పెళ్లి జరగ్గా.. నెటిజన్లు పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు.