సిద్దిపేట జిల్లా కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ మధ్య గల ఖాళీ స్థలంలో శుక్రవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎండిన చెట్లు, పొదలకు మంటలు వ్యాపించడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది తక్షణమే చేరుకుని మంటలను ఆర్పివేశారు. జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సీపీ ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.