KRNL: విజయవాడలో కర్నూలు జిల్లా జోనల్–5 కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ బీద రవిచంద్రని కర్నూలు జిల్లా టీడీపి అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో పార్టీ మరింత బలోపేతం చేయడం, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ శ్రేణులను సంఘటితం చేయడం, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం వంటి కీలక అంశాలపై సవివరంగా చర్చించినట్లు పేర్కొన్నారు.