ATP: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని అనంతపురం ఎస్పీ పి.జగదీష్ ప్రజలను కోరారు. అన్ని బంకుల్లో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. అక్రమ నిల్వలు సృష్టించినా, బ్లాక్ మార్కెట్లో విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.