అనకాపల్లి పట్టణం తాకాశి వారి వీధిలో వేంచేసియున్న నూకంబిక అమ్మవారి ఆలయంలో కొత్త అమావాస్య జాతరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ రాజేష్ తెలిపారు. మార్చి నెలలో జరిగే జాతరకు సంబంధించి బుధవారం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మూహుర్తపు రాట వేసారు. ప్రతి ఏటా అమ్మవారి జాతరను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.