»Vaarahi Tour Stop Because Of Nara Lokesh Yatraambati Rambabu
minister ambati rambabu:వారాహి ఎందుకు ఆగిందంటే, మంత్రి అంబటి చెప్పిన రీజన్ ఇదే?
ఏపీ టీడీపీ ముఖ్య నేత నారా లోకేశ్పై (lokesh) మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై (pawan kalyan) కూడా హాట్ కామెంట్స్ చేశారు. వారాహి (vaarahi) యాత్ర ఎందుకు ఆగిందని అడిగారు. లోకేశ్ (lokesh) యాత్ర చేస్తున్నందనే పవన్ వారాహి ఆగిందని కామెంట్ చేశారు.
minister ambati rambabu:ఏపీ టీడీపీ ముఖ్య నేత నారా లోకేశ్పై (lokesh) మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై (pawan kalyan) కూడా హాట్ కామెంట్స్ చేశారు. యువగళం పేరుతో నారా లోకేశ్ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. 400 రోజులపాటు 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు గల ప్రజలను కలిసి, సమస్యలను తెలుసుకుంటున్నారు. నారా లోకేశ్ అవగాహనతో విమర్శలు చేయాలని మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu) సూచించారు. ఊరికే మాట్లాడటం మంచి పద్దతి కాదని హితవు పలికారు.
పవన్ కళ్యాణ్ (pawan kalyan) గురించి అంబటి ప్రస్తావించారు. ఆయన వారాహి (vaarahi) యాత్ర ఎందుకు ఆగిందని అడిగారు. లోకేశ్ (lokesh) యాత్ర చేస్తున్నందనే పవన్ వారాహి ఆగిందని కామెంట్ చేశారు. ఇప్పుడే పవన్ వారాహిలో వెళితే.. జనం అటు మళ్లుతారని పేర్కొన్నారు. అందుకోసమే ఆగారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి టీడీపీ, బీజేపీతో పొత్తు ఉంటుందని జనసేనాని సంకేతాలను ఇస్తున్నారు. టీడీపీ, బీజేపీ మాత్రం.. తలో మాట చెబుతున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున పొత్తులపై స్పష్టత రాలేదు.
మూడు రాజధానుల (3 capitals) విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అంబటి రాంబాబు (ambati rambabu) తెలిపారు. 3 రాజధానులే తమ విధానం అని స్పష్టంచేశారు. జనసేన, టీడీపీ విలువలకు పాతర వేశాయని చెప్పారు. నారా లోకేశ్ యువగళం పేరుతో జనాల వద్దకు వెళ్తున్నారని.. దీంతో టీడీపీ మరింత పతనం అవడం ఖాయమని తెలిపారు. తెలుగు చక్కగా మాట్లాడలేని వ్యక్తి టీడీపీ వారసుడా అని అడిగారు. లోకేశ్ చేపట్టిన యాత్రకు లక్ష్యం ఏంటో చెప్పాలని నిలదీశారు.
ఏపీలో మరో ఏడాదిన్నరలో ఎన్నికలు ఉన్నాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. తమ పార్టీని గెలిపిస్తే.. సమస్యలు తీరుస్తామని చెబుతున్నారు. ఇప్పటికే నారా లోకేశ్ పాదయాత్ర చేపట్టారు. పవన్ కల్యాణ్ వారాహిలో రాష్ట్రమంతా పర్యటిస్తారు.