KRNL: తుగ్గలి(మం) రేల్లపాడు తాండలో రీ న్యూ ప్రైవేట్ విండ్ పవర్ కంపెనీ రైతులు నాగేంద్ర నాయక్, సురేష్ నాయక్ల పొలాల్లో హెన్డీ లైన్లు వేయడానికి ప్రయత్నించడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. బుధవారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ.. కంపెనీకి వత్తాసు పలుకుతున్న తుగ్గలి తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలన్నారు.