JN: వెల్దండ రిజర్వాయర్ నుంచి నర్మెట్ట, అమ్మాపురం, అక్కరాజుపల్లి, తరిగొప్పుల గ్రామాలకు కొమురవెల్లి దేవస్థాన కమిటీ చైర్మన్ గంగం నరసింహారెడ్డి నీటిని విడుదల చేశారు. రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతు రుణమాఫీ చేసినట్లు ఛైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.