MNCL: జన్నారం మండలం కవ్వాల్ హాస్టల్ తండాలోని కట్టె స్తంభాలు, ఈదురు గాలులకు ఒక పక్కకు ఒరిగిపోయాయి. ఎనిమిదేళ్లుగా ఈ సమస్య వేధిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. పొలాలకు వెళ్లే మార్గంలో ప్రాణాపాయం పొంచి ఉందని, తక్షణమే స్పందించి శాశ్వత సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.