KMR: ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తెలుగు, హిందీ, ఉర్దూ సబ్జెక్టులకు సంబంధించి అధికారులు ‘సెట్-బీ’ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. మొత్తం 246 మంది విద్యార్థులకు గాను 243 మంది హాజరు కాగా, ముగ్గురు గైర్హాజరయ్యారని అధికారులు వెల్లడించారు.