NGKL: కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో చోటుచేసుకున్న కుల వివక్ష దాడిలో పసికందు మృతిచెందిన ఘటనపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన, వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి పార్టీ తరపున పూర్తి అండగా ఉంటామని, నిందితులకు శిక్ష పడే వరకు పోరాడి న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు.