NRPT: ధన్వాడ మండలంలోని కిష్టాపూర్ ఉన్నత పాఠశాలలో బుధవారం స్వయం వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠాలు బోధించారు. జిల్లా కలెక్టర్గా సుహాసిని, జిల్లా విద్యాధికారిగా కృష్ణవేణి, మండల విద్యాధికారిగా శివప్రసాద్, ప్రధానోపాధ్యాయులుగా నందిని వ్యవహరించారు. బోధనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల హెచ్ఎం రఘుమోహన్ బహుమతులు ఇచ్చారు.