ELR: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై జంగారెడ్డిగూడెం న్యాయస్థానం కఠిన నిర్ణయం తీసుకుంది. వేలేరుపాడు మండలానికి చెందిన ఒక యువకుడు మద్యం సేవించి వాహనం నడుపుతుండగా అదుపులోకి తీసుకున్నారు. అతనికి రూ. 10వేలు జరిమానా విధిస్తూ బుధవారం ప్రత్యేక జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ 2nd క్లాస్ మెజిస్ట్రేట్ నక్క వెంకటేశ్వర్లు తీర్పు ఇచ్చారు.