BHPL: గోరికొత్తపల్లి(M) నిజాంపల్లి గ్రామంలోని 1వ వార్డులో బుధవారం గ్రామ సర్పంచ్ సునీత-రవీందర్ ఆధ్వర్యంలో GP కార్మికులు సైడ్ డ్రైనేజీ కాలువలు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.