HYD: వేసవి తీవ్రత పెరుగుతున్న వేళ నగరంలో కొబ్బరి బొండాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఉప్పల్, హైటెక్ సిటీ, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఒక్కో బొండం ధర రూ.70 నుంచి రూ.120 వరకు విక్రయిస్తున్నారు. ప్రదేశాన్ని బట్టి రేట్లు మారుతున్నాయి. వేడి నుంచి ఉపశమనం కోసం ప్రజలు అధికంగా కొబ్బరి నీటిని తీసుకుంటుండటంతో విక్రయాలు పెరిగాయి.