AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెండో రోజు పులివెందులలో పర్యటిస్తున్నారు. ఇవాళ వేంపల్లి మండలం నందిపల్లి నందీశ్వర ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమంలో పాల్గొననున్నారు. కాగా, జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆలయానికి రూ.1.8 కోట్లు మంజూరు చేశారు. మొత్తం రూ.6 కోట్లతో ఆలయ నిర్మాణం జరిగింది.