JGL: సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీమంత్రి జీవన్ రెడ్డి అస్వస్థతకు గురై సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం జగిత్యాల జిల్లాలో తన అధికారిక పర్యటనలను వాయిదా వేసుకున్నారు. అనంతరం కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి జీవన్ రెడ్డిని పరామర్శించారు.