MDCL: ఘట్కేసర్లో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ నివాసమూర్తి తెలిపారు. ప్రస్తుత పనుల పురోగతిని పరిశీలించిన ఆయన, మే 2026 చివరి నాటికి వంతెన నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. వంతెన పూర్తయితే రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ సమస్యలు తగ్గి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన రాకపోకలు అందుబాటులోకి రానున్నాయి.