మన్యం: జీవో నంబర్ 85ను రద్దు చేయాలని పీహెచ్సీ వైద్యుల సంఘం జిల్లా కార్యదర్శి డాక్టర్ వినోద్ అన్నారు. ఆదివారం పార్వతీపురం పట్టణంలో వైద్యులు బైక్ ర్యాలీ నిర్వహించారు. వైద్యులు పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటాను కుదిస్తూ జారీ చేసిన జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో విధులు నిర్వహించే వైద్యులకు అలవెన్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.