KMR: పట్టణ పరిధిలోని దేవునిపల్లి పదవ వార్డు కౌన్సిలర్ కాసర్ల మాధవి రవీందర్ మంగళవారం దేవునిపల్లి నుంచి రామారెడ్డి-ఇసన్నపల్లి కాలభైరవ స్వామి ఆలయానికి 15 మంది అనుచరులతో పాదయాత్రగా వెళ్లారు. వార్డులో ఎటువంటి అవాంతరాలు లేకుండా అన్ని అభివృద్ధి పనులు సక్రమంగా కొనసాగేందుకు పాదయాత్ర చేస్తున్నట్లు ఆమె వివరించారు.